TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ట్రంప్ కు మోడీ షాక్.. 3.6 బిలియన్ డాలర్ల ఒప్పందం రద్దు

Published on: Fri Aug 8, 2025 12:45PM

 ట్రంప్ టారిఫ్ వార్ కు ఇండియా దీటుగా బదులిచ్చింది. ఇండియాపై 50 శాతం సుంకాలు విధిస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకాలు చేయడానికి ప్రతిగా ఇండియా  బోయింగ్ పీ81 విమానాల కొనుగోలు ఒప్పందం నంచి వైదొలగింది.  సముద్ర గస్తీ విమానాలను కొనుగోలుకు సంబంధించి 3.6 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని ఇండియా నిలిపివేసింది.

వాస్తవానికి ఈ ఒప్పందం 2021లో  జరిగింది. ఆరు పీ81 జెట్‌ల  కొనుగోలు కోసం జరిగిన ఈ ఒప్పందం విలువ అప్పట్లో  2.42 బిలియన్ డాలర్లు.  అయితే ఆ తరువాత దీనిని సవరించి   3.6 బిలియ డాలర్లకు  పెంచారు. ఇప్పుడా ఒప్పందం నుంచి భారత్ వైదొలగింది.