TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మిలటరీ అధికారులతో మోడీ భేటీ

Published on: Fri Oct 17, 2014 2:33PM

 

భారత ప్రధాని నరేంద్రమోడీ శుక్రవారం నాడు త్రివిధ దళాలకు చెందిన అత్యున్నత స్థాయి అధికారులను కలిశారు. చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మోడీ మిలటరీ కమాండర్లతో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత త్రివిధ దళాలకు చెందిన అధికారులతో సమావేశం కావడం ఇది మొదటిసారి. ఢిల్లీలోని రక్షణ మంత్రిత్వశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్‌లో కూడా మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారితో ఆయన సరిహద్దు భద్రత గురించి చర్చించారు. ఈ సమావేశంలో రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ కూడా పాల్గొన్నారు.