అహ్మదాబాద్ లో ప్రధాని మోడీ

posted on: Jun 13, 2025 10:01AM

ప్రధాని నరేంద్రమోడీ శుక్రవారం (జూన్ 13) అహ్మదాబాద్ చేరుకున్నారు. గురువారం జరిగిన ఘోర విమన ప్రమాదం సంఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. అలాగే ఈ ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు.

కాగా విమాన ప్రమాదం జరిగిన వెంటనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు హుటాహుటిన అహ్మదాబాద్ చేరుకుని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే.  

google-ad-img
    Related Sigment News
    • Loading...