Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...31 నుంచి మోడీ రెండు రోజుల చైనా పర్యటన
posted on: Aug 7, 2025 10:15AM

ప్రధాని నరేంద్రమోడీ చైనా పర్యటన ఖరారైంది. ఈ నెల 31 నుంచి రెండు రోజుల పాటు అంటే సెప్టెంబర్ 1 వరకూ ప్రధాని మోడీ చైనాలో పర్యటిస్తారు. షాంగై సహకార సదస్సులో మోడీ పాల్గొననున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత నేపథ్యంలో మోదీడీ చైనా పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సదస్సుకు హాజరు కావాలంటూ చైనా నుంచి అందిన ఆహ్వానం మేరకు మోడీ ఈ దేశ పర్యటనకు వెడుతున్నారు. 2019లో గాల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. ఆ తర్వాత కూడా పలు సార్లు చైనా కవ్వింపు చర్యలకు పాల్పడగా భారత్ దీటుగా సమాధానమిచ్చింది. ఆ ఘటన తరువాత మోడీ చైనా పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి.
ఇప్పుడు ట్రంప్ టారీఫ్ టెర్రర్ నేపథ్యంలో భారత్ చైనాలు సంబంధాలను బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే మోడీ చైనా పర్యటనకు ఎనలేని ప్రాధాన్యత ఏర్పడింది. ఈ పర్యటనలో ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకు సంబంధించి కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది.






