Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మిధున్ చక్రవర్తిని ప్రశ్నించిన ఈడీ అధికారులు
posted on: May 18, 2015 10:02AM
.jpg)
ఒకనాటి ప్రముఖ హిందీ చలనచిత్ర నటుడు మరియు పశ్చిమ బెంగాల్ రాష్ర్టంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్.పి అయిన మిధున్ చక్రవర్తి శారదా గ్రూప్ ఆఫ్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. ఆ గ్రూప్ కే చెందిన శారదా చిట్ ఫండ్ సంస్థలో జరిగిన భారీ కుంభకోణంలో ఇప్పటికే తృణమూల్ పార్టీకి చెందిన కొందరు మంత్రులు, యంపీలను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసారు. ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు నిన్న మిధున్ చక్రవర్తిని కూడా ఈ కుంభకోణం గురించి చాలాసేపు ప్రశ్నించి ఆయన సాక్ష్యాన్ని రికార్డు చేశారు. తనకు ఈ కుంభకోణానికి ఎటువంటి సంబంధం లేదని, తను కేవలం ఆ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా మాత్రమే వ్యవహరించానని, అందుకోసం ఆ సంస్థ తనకు చెల్లించిన మొత్తాన్ని కూడా తను తిరిగి ఇచ్చేందుకు సిద్దమని ఈడీ అధికారులకు ఆయన చెప్పినట్లు సమాచారం. సినీ నటులందరికీ రాజకీయాలు అచ్చిరావనే సంగతి ఇదివరకు అమితాభ్ బచ్చన్, ఆ తరువాత దాసరి నారాయణ రావు ఇప్పుడు మిధున్ చక్రవర్తిలను చూస్తే అర్ధమవుతుంది.


.jpg)



