ఎయిమ్స్లో చేరిన సుష్మాస్వరాజ్
posted on: Apr 26, 2016 11:30AM

కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ అస్వస్థతకు గురయ్యారు. ఛాతినొప్పి రావడంతో నిన్న రాత్రి ఆమెను కుటుంబసభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్లో చేర్చారు. వైద్య పరీక్షల అనంతరం, సుష్మ పరిస్థితి నిలకడగానే ఉందని ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం ఇవాళ సుష్మస్వరాజ్ పాకిస్థాన్ విదేశాంగ కార్యదర్శి అజిజ్ అహ్మద్తో భేటీ కావాల్సి ఉంది. ఆమె అనారోగ్యం కారణంగా ఈ భేటీని వాయిదా వేసినట్టు తెలుస్తోంది.
Latest YouTube Trending Video NEWS







