టిడిపిలో చేరనున్న గంటా..?

 

చిరంజీవి ముఖ్య అనుచరుడిగా ప్రజారాజ్యం పార్టీ నుంచి వచ్చిన నాయకుడు గంటా శ్రీనివాస్‌రావు. చిరంజీవి అండదండలతో కాంగ్రెస్‌లో మంత్రి పదవిని కూడా సాదించిన గంట ప్రస్థుతం సమైక్య వాదానికి బలంగా మద్దతు పలుకుతున్నారు.అయితే గత కొద్ది రోజులుగా మారుతున్న రాజకీయ సమీకరణాలు సమైక్య ఉద్యమ నేపధ్యంలో గంటా శ్రీనివాస్‌ రావు పార్టీని వీడుతున్నారన్న వాదన బలంగా వినిపిస్తుంది.

ఇప్పటికే టిడిపి పార్టీతో టచ్‌లో ఉన్న ఆయన ముందుగా తన మంత్రి పదవి తరువాత కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్‌ పార్టీకి కూడా రాజీనామ చేయనున్నారు. అందులో భాగంగానే తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా సోమవారం గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించనున్నారు గంట.

సీమాంద్రలో సమైక్య ఉద్యమం ఉదృతంగా జరగుతున్న హైకమాండ్‌ దానిపై స్పందిచక పోగా తెలంగాణ ఏర్పాటు దిశగా అడుగులు వేయడం సరికాదంటున్నారు. విభజన జరిగితే సీమాంద్రల్లో పార్టీ ఉనికి కోల్పోతుందని భావించిన మరికొంత మంది మంత్రులు కూడా గంటా బాటలోనే రానున్నారు.