వైకాపా కొత్త పాయింటు

posted on: Nov 15, 2013 7:13PM

 

‘కీప్ సమ్ చేంజ్’ అంటే దానికి అర్ధం జనాలు రకరకాలుగా చెప్పుకోవచ్చు గాక. వాటిలో ఒకటి నిరంతరం కొత్త ఆలోచనలకి ప్రయత్నించమనే సందేశం కూడా ఇమిడి ఉంది. దానిని ఎవరు పట్టించుకొన్నా, కోకపోయినా వైకాపా మాత్రం బాగా వంట పట్టించుకొంది. అందుకే ఎప్పటి కప్పుడు సరి కొత్త ట్విస్టులు, యూ టర్నులు, వ్యూహాలతో దూసుకుపోతూ ఉంటుంది. ఈవిషయంలో ఏ ఇతర పార్టీ కూడా దానికి సరిసాటి కాదని ఒప్పుకోక తప్పదు. ఇక లేటెస్ట్ గా ఆ పార్టీ కనుగొన్నకొత్త సిద్దాంతం ఏమిటంటే తమ అధినేత జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయడానికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేస్తోందని! ఈ సంగతి కనిపెట్టడానికి కొంచెం ఆలస్యమయినా చాలా చక్కటి పాయింటుతో వచ్చామని ఆ పార్టీకి చెందిన మేకపాటి రాజమోహన్ రెడ్డి భావించారు. కానీ, తెదేపా కూడా సరిగ్గా ఇలాగే భావించడం యాదృచ్చికమేమో? అయితే అంత మాత్రాన్న ఈ రెండు పార్టీలు కుమ్మక్కు అయ్యే అవకాశమే లేదని గట్టిగా చెప్పవచ్చును.

google-ad-img
    Related Sigment News
    • Loading...