40 శాతం ఔషధాలు నకిలీ, నాసిరకమైనవే

posted on: Mar 22, 2012 11:17AM

ప్రస్తుతం రాష్ట్రంలో లభ్యమవుతున్న ఔషధాలలో దాదాపు 40 శతం నకిలీ, నాసిరకమైనవేనని ఒక సర్వేలో తేలింది. ఫోరం ఫర్ ఔటర్ సొసైటీ అనే సంస్థ 5 నగరాలు, 20 పట్టణాలు, 90 గ్రామాల్లో నిర్వహించిన సర్వేలో ఈ వాస్తవం బైటపడింది. రాష్ట్రంలోని వందలాది మెడికల్ షాపుల్లో లభ్యమవుతున్న టాబ్లెట్లు, ఇంజక్షన్లు, సెలైన్లు, టానిక్కులు 40 శాతం నకిలీ, నాసి రకానివని తేలినట్లు ఆ సంస్థ ప్రకటించింది. గ్రామీణ ప్రాంత మందుల షాపుల్లో ఈ నకిలీల బెడద ఎక్కువగా ఉంది. విచ్చలవిడిగా చలామణి అవుతున్న ఈ నకిలీ నాసిరకం ఔషధాలు రోగుల ప్రాణాలకు ముప్పుగా మారాయి. వీటిని నియంత్రించాల్సిన ఔషధ నియంత్రణ శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. మెడికల్ షాపుల ఏర్పాటు నుంచి లైసెన్సుల జారీతో పాటు మెడికల్ షాపుల్లో తనిఖీల వరకు ముడుపులే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని తెలిసింది. దీనికి తోడు ఈ శాఖ అరకొర సిబ్బందితో సతమతమవుతోంది. ఫలితంగా నకిలీ, నాసి రకం మందుల తయారీ దారులను అడ్డుకునే వారు రాష్ట్రంలో కరువయ్యారు.

 

 

google-ad-img
    Related Sigment News
    • Loading...