ఉప ఎన్నికల బరిలో...

 

ఉప ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. మెదక్ ఉప ఎన్నికల బరిలో 14 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మెదక్ పార్లమెంట్ స్థానం బరిలో తెరాస నుంచి కొత్త ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి సునీతా లక్ష్మారెడ్డి, భారతీయ జనతాపార్టీ, తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా జగ్గారెడ్డి బరిలో వున్నారు. మిగతా అందరూ స్వతంత్ర అభ్యర్థులు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామ శాసనసభ స్థానం నుంచి నలుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి దివంగత ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు కుమార్త తంగిరాల సౌమ్య పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బోడపాటి బాబూరావు నిలిచారు. పుల్లయ్య, పుల్లారావు అనే ఇద్దరు వ్యక్తులు స్వతంత్ర్య అభ్యర్థులుగా పోటీలో వున్నారు.