మక్కాలో మరో పెను విషాదం, 250మంది మృతి

మక్కాలో మరోసారి పెనువిషాదం చోటు చేసుకుంది, పవిత్ర హజ్ యాత్రలో తొక్కిసలాట జరిగి 250మందికి పైగా మరణించారు, మరో 500మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు, క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి సీరియస్ గా ఉండటంతో మృతుల సంఖ్యగా పెరిగే అవకాశముందని తెలుస్తోంది. సైతాన్ ను రాళ్లతో కొట్టే కార్యక్రమంలో భాగంగా యాత్రికులంతా ఒక్కసారిగా ఎగబడటంతో ఈ దుర్ఘటన జరిగింది. ఇటీవలే భారీ క్రేన్ కూలి 107మంది చనిపోగా, తాజా దుర్ఘటనలో 250మందికి పైగా ప్రాణాలు కోల్పోవడంతో మక్కాలో ఎటుచూసినా విషాదం నెలకొంది. అయితే గతంలో ఎన్నడూ లేనివిధంగా లక్షలాది మంది భక్తులు పోటెత్తడంతోనే ఈ తొక్కిసలాట జరిగిందని భావిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu