అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు మాయావతి
Published on: Thu Oct 15, 2015 1:52PM

బీఎస్పీ అధినేత్రి మాయావతి కొత్త అస్త్రాన్ని బయటికి తీశారు, గతంలో ఒకసారి దళిత్, ముస్లిం, బ్రాహ్మణ కాంబినేషన్ తో ఘనవిజయం సాధించిన మాయావతి...ఈసారి అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తామంటూ కొత్త వ్యూహాన్ని ఎంచుకున్నారు, వచ్చే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అగ్ర కులాలను ఆకట్టుకోవడానికి కొత్త ఎత్తువేసిన మాయావతి... బీఎస్పీ అధికారంలోకి వస్తే అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అగ్రవర్ణాల్లోని పేదలు చాలా దయనీయమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని, వారికి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్సించాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు, తాము అధికారంలోకి వస్తే అగ్రవర్ణ పేదలకు కచ్చితంగా రిజర్వేషన్లు అమలు చేస్తామని మాయావతి ప్రకటించారు.


