దీపావళిని మిస్సయ్యా: జుకెర్బర్గ్
Published on: Wed Nov 11, 2015 6:24PM

ఇండియాలో దీపావళి పండుగను మిస్సయ్యానని ఫేస్బుక్ వ్యవస్థాపక సీఇవో మార్క్ జుకర్ బర్గ్ తన ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేసిన ఒక పోస్టులో పేర్కొన్నారు. జుకర్ బర్గ్ ఇటీవల భారతదేశంలో పర్యటించి వెళ్ళారు. అయితే దీపావళి పండుగ వరకు ఇండియాలోనే వుండాలని అనుకున్నప్పటికీ కుదర్లేదని ఆయన తెలిపారు. శుభ పరిణామానికి సూచనగా దీపాలు వెలిగించి, టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకుంటారని, వాటిని ప్రత్యక్షంగా చూడటం తాను మిస్సయ్యానని పేర్కొన్నారు.


