TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీ బీజేపీ, టీడీపీ నేతలకు మావోయిస్టుల వార్నింగ్..

Published on: Fri Dec 18, 2015 2:48PM


 

ఉమ్మడి రాష్ట్రంలో ఏమో కానీ రాష్ట్రం విడిపోయిన తరువాత మాత్రం మావోయిస్టుల ఉనికి కాస్త పెరిగిందనే చెప్పొచ్చు. అందులోనూ తెలంగాణ రాష్ట్రంలో కాస్త ఎక్కువే. ఇప్పటికే మావోయిస్టులు తెలంగాణలోని అధికార పార్టీకి వ్యతిరేకంగా పోస్టర్లు వేయించడం..ఆ పార్టీకి సంబంధించిన నేతలను కిడ్నాప్ చేయడం వంటివి చేశారు. ఇప్పుడు ఏపీలోనూ అలాంటి పోస్టర్లు వెలిశాయి. విశాఖ జిల్లాల గూడెం కొత్త వీధి మండలంలోని సిరిబాల ప్రాంతంలో మావోయిస్టుల పోస్టర్లు కనిపించాయి. అధికారంలో ఉన్న టీడీపీ - బీజేపీలను తరిమితరిమి కొట్టాలంటూ ఆ పోస్టర్లలో పిలుపునిచ్చారు.ఆన్ రాక్ యాజమాన్యంతో టీడీపీ కుమ్మక్కయిందని..బాక్సైట్ కు వ్యతిరేకంగా అందరూ ఏకం కావాలని.. మన్యంలో బాక్సైట్ గనుల తవ్వకం జరిపితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.