సరి-బేసి విధానానికి ఎంపీల నిరసన.. సైకిల్, గుర్రంపై పార్లమెంట్ కి

 

ఢిల్లీలోని వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి కేజ్రీవాల్ సరి-బేసి విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ పద్దతి నుండి తమకు మినహాయింపు ఇవ్వాలని ఎంపీలు డిమాండ్ చేస్తున్న సంగతి కూడా విదితమే. ఈ నిబంధనలతో పార్లమెంట్ సమావేశాలకు వెళ్లాలంటే కష్టమని.. తమకు ఈ పద్దతి నుండి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. బీజేపీ నేతలు తమ నిరసనను ప్రదర్శించారు. బీజేపీ ఎంపీ రామ్‌ ప్రసాద్ శ‌ర్మ ఈరోజు సరి-బేసి విధానానికి వ్య‌తిరేకంగా వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు. ఆయన గుర్రంపై స్వారీ చేస్తూ పార్లమెంటుకు వచ్చారు. మ‌రో బీజేపీ ఎంపీ మ‌నోజ్ తివారీ సైకిల్‌పై చ‌క్క‌ర్లు కొడుతూ.. స‌రి బేసి విధానంపై నిర‌స‌న వ్య‌క్తం చేశారు.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu