సరి-బేసి విధానానికి ఎంపీల నిరసన.. సైకిల్, గుర్రంపై పార్లమెంట్ కి

 

ఢిల్లీలోని వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి కేజ్రీవాల్ సరి-బేసి విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ పద్దతి నుండి తమకు మినహాయింపు ఇవ్వాలని ఎంపీలు డిమాండ్ చేస్తున్న సంగతి కూడా విదితమే. ఈ నిబంధనలతో పార్లమెంట్ సమావేశాలకు వెళ్లాలంటే కష్టమని.. తమకు ఈ పద్దతి నుండి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. బీజేపీ నేతలు తమ నిరసనను ప్రదర్శించారు. బీజేపీ ఎంపీ రామ్‌ ప్రసాద్ శ‌ర్మ ఈరోజు సరి-బేసి విధానానికి వ్య‌తిరేకంగా వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు. ఆయన గుర్రంపై స్వారీ చేస్తూ పార్లమెంటుకు వచ్చారు. మ‌రో బీజేపీ ఎంపీ మ‌నోజ్ తివారీ సైకిల్‌పై చ‌క్క‌ర్లు కొడుతూ.. స‌రి బేసి విధానంపై నిర‌స‌న వ్య‌క్తం చేశారు.