మన్మోహన్ కు మద్ధతు తెలిపిన సోనియా

 

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి బొగ్గు కుంభకోణం కేసులో కోర్టు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఆయనకు పలువురు సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో పాటు పలువురు సీనియర్ నేతలు వీరప్పమొయిలీ, ఆనంద్ శర్మ, గులాంనబీ ఆజాద్, ఏకే ఆంటోనీలు ఏఐసీసీ కార్యాలయం నుండి మన్మోహన్ సింగ్ ఇంటివరకు పాదయాత్ర చేసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సోనియాగాంధీ మాట్లాడుతూ... మన్మోహన్ సింగ్ వ్యక్తిత్వం ఎంత గొప్పదో ప్రపంచానికి తెలుసు, ఆయన నిర్ధోషిగా బయటకు వస్తారని, ఆయనకు మద్ధతుగా న్యాయపోరాటం చేస్తామని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu