జగన్ పై మందకృష సంచలన వ్యాఖ్యలు
posted on: Mar 22, 2025 2:23PM
ఎంఆర్ పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ వైకాపా అధినేత వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్ల వైకాపా ప్రభుత్వం ఎస్ సి వర్గీకరణ కోసం ఒక్క ప్రయత్నం కూడా చేయలేదన్నారు జగన్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందో ఆ పార్టీలోని మాదిగ నేతలు పునరాలోచించుకోవలన్నారు. ఎపి అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎస్ సి వర్గీకరణపై ఏకగ్రీవ తీర్మానం చేయడం చారిత్రక విజయమన్నారు. శాసనమండలిలో వైకాపాకు బలమున్నప్పటికీ చంద్రబాబు తన రాజకీయ అనుభవంతో ఏకగ్రీవం చేయగలిగారన్నారు. దశాబ్దాలుగా నలుగుతున్న వర్గీకరణ తీర్మానంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారన్నారు. ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా ముఖ్యమంత్రి న్యాయం వైపే నిలబడ్డారన్నారు.


.webp)
.webp)


