హైదరాబాద్‌ని అమ్మేస్తారు

 

జీహెచ్ఎంసీ ఎన్నికలు, పార్టీ సభ్యత్వ నమోదుపై సోమవారం ఎల్బీనగర్ లో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భగా మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. అమలు చేయడానికి వీలుకాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ ను కూడా అమ్మకానికి పెడుతోందని, సెక్రటేరియట్ ను కూడా ప్రవేటు సంస్థలకు ధారదత్తం చేసేందుకు సిద్ధమవుతోందని అన్నారు. హైదరాబాద్ లో ఉన్న ప్రభుత్వ సంస్థలను కాపాడుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలందరూ కలిసి ఎటువంటి విభేదాలు లేకుండా ముందుకు రావాలని సూచించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లో రాజకీయ వలసలను ప్రోత్సహించిందే తప్ప.. ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు.