టీడీపీలోకి మల్లారెడ్డి.. డేట్ ఫిక్స్!?
posted on: Oct 7, 2024 12:50PM
.webp)
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి రంగం సిద్ధమైంది. ఆయన టీడీపీలోకి చేరే డేట్ కూడా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును మల్లారెడ్డి హైదరాబాద్లో చంద్రబాబును కలిసినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డితో పాటు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో చంద్రబాబును కలిసినట్టు సమాచారం. తన మనవరాలు శ్రేయరెడ్డి పెళ్లికి ఆహ్వానించడం కోసమే చంద్రబాబును కలుస్తున్నట్టు కలరింగ్ ఇచ్చినప్పటికీ మల్లారెడ్డి అసలు ఉద్దేశం టీడీపీలో చేరడమేనని తెలుస్తోంది. .


.webp)



