హీరో ఇంటిలో ఏనుగుదంతాలు.. ఉద్యమకారుల ఆందోళనలు

posted on: Jul 8, 2015 12:55PM

 

ఏనుగు దంతాలు ఇంటిలో పెట్టుకున్నాడన్న ఆరోపణలతో మళయాల హీరో జయరామ్ కు కష్టాలు ఎదురయ్యాయి. ఆయన మీద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వన్యప్రాణుల హక్కుల ఉద్యమకారులు ఆందోళనకు దిగారు. వివరాలు ప్రకారం.. జయరామ్ కు ఒక పెంపుడు ఏనుగు ఉండేది.. అనారోగ్యం కారణంగా అది మరణించడంతో ఏనుగు దంతాలను తన ఇంట్లోనే ఉంచుకున్నాడు. దీనికి అప్పుడు కేరళ అటవీ శాఖ కూడా అనుమతి ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ విషయం బయటపడటంతో జయరామ్ కు ఒక న్యాయం, మిగిలిన వారికి మరో న్యాయమా అంటూ వన్య ప్రాణుల హక్కుల ఉద్యమకారులు ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తం కావడంతో ఈ విషయం లో జోక్యం చేసుకోవాల్సిందిగా కేరళ ఫారెస్ట్ టాస్క్ ఫోర్స్ అధికారులు ప్రధాని మోదీకి లేఖ రాశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...