పెళ్ళికి ముందే లైంగిక పరీక్షలు చేయాలి... కోర్టు...

 

సంసారానికి పనికిరాని అనేకమంది పురుషులు, స్త్రీలు ఆ విషయాన్ని దాచిపెట్టి పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఆ తర్వాత అటువంటి వారిని పెళ్ళాడిన భాగస్వాములు విడాకులు కావాలని కోరుతూ కోర్టుకు ఎక్కడం తరచుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో వివాహానికి ముందే అబ్బాయిలకుఇంపోటెన్సీ (నపుంసకత్వం), అమ్మాయిలకు ఫ్రిజిడిటి (లైంగిక సామర్థ్యం) పరీక్షలను ఎందుకు తప్పని చేయకూడదంటూ మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ మేరకు కేంద్రానికి మద్రాస్ హైకోర్టు మదురై బెంచి నోటీసులు జారీ చేసింది. తన భర్త నపుంసకుడని, తమకు విడాకులు మంజూరు చేయాలని కోరుతూ ఒక మహిళ కోర్టును ఆశ్చయించింది. ఈ కేసు మీద విచారణ సందర్భంగా కోర్టు పైవిధంగా వ్యాఖ్యానించింది. ‘వైవాహిక బంధాలు విఫలమవకుండా నిరోధించడానికి పెళ్లికి ముందే లైంగిక పరీక్షలు నిర్వహించడాన్ని తప్పనిసరి చేయాల్సిన అవసరం లేదా అని' న్యాయమూర్తి జస్టిస్ ఎస్ కిరుబాకరస్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భర్త నపుంసకత్వం లేదా భార్య లైంగిక సామర్థ్యం లేమి కారణాల వల్ల విడాకుల కేసులు పెరిగిపోతున్నాయని చెన్నై ఫ్యామిలీ కోర్టులో నమోదవుతున్న విడాకుల కేసులను ఉదహరించారు.