శ్రీలంక అధ్యక్షుడి తమ్ముడి హత్య

 

శ్రీలంక దేశాధ్యక్షుడు మైత్రిపాల శిరిసేన తమ్ముడు ప్రియాంత సిరిసేన(40) దారుణహత్యకు గురయ్యారు. రెండు రోజుల క్రితం ప్రియాంత సిరిసేన మీద ఆయన స్నేహితుడే గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆయన తీవ్ర గాయాల పాలయ్యారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం మరణించారు. ఆయన శ్రీలంకలో ప్రముఖ పారిశ్రామికవేత్త. దాడిలో ప్రియాంత తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను కొలంబోలోని ఓ ఆస్పత్రి ఐసీయూలో వుంచారు. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల ప్రస్తుతం చైనా పర్యటనలో వున్నారు.