పాపకు దూకుడు బాగా ఎక్కువయ్యిందట...!

posted on: Dec 27, 2013 3:42PM

 

మహేశ్‌బాబు "నేనొక్కడినే" చిత్రం పోస్టర్ పై రోజుకో చర్చ పెరుగుతుంది. ఆ పోస్టర్ మహిళలను కించపరచేదిగా ఉందంటూ సమంత తన ట్విటర్‌లో విమర్శించడంతో తెలుగు ఇండస్ట్రీలో ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. పైగా సమంత మాటలను దర్శకుడు శేఖర్ కమ్ముల సమర్ధించడం వలన ఈ వివాదం మరింత ఎక్కువయ్యింది. దాంతో ఇప్పటివరకు సమంత పైన తీవ్ర ఆగ్రహంతో ఉన్న మహేష్ అభిమానులు.. శేఖర్ పై కూడా వ్యతిరేకంగా నిలుస్తున్నారు. అయితే సమంత ఈ విధంగా చేయడానికి గల కారణం..."కేవలం తనకు "1" సినిమాలో అవకాశం ఇవ్వనందుకే అని, అంతే కాకుండా.. కనీసం మహేష్ తన కొత్త సినిమా "ఆగడు"లో అయిన తనను తీసుకోలేదనే కోపంతోనే ఇలా చేస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇలాగే ఈ అమ్మడు మరికొన్ని రోజులు చేస్తే తెలుగు ఇండస్ట్రీ నుండి బ్యాగ్ సర్దుకొని తమిళనాడుకు వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడేలా ఉందని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మహేష్ అభిమానులందరూ కూడా ఈ అమ్మడికి పూర్తిగా వ్యతిరేకంగా మారిపోయారు. మరి ఈ అమ్మడి పరిస్థితి ఎలా ఉండబోతుందో త్వరలోనే తెలియనుంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...