Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...గ్రామాన్ని దత్తత తీసుకున్న మహేశ్ బాబు
posted on: Sep 28, 2015 3:07PM
.jpg)
శ్రీమంతుడు సినిమా ఆదర్శంగా తీసుకొని ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ మహేశ్ బాబును కోరడం.. మహేశ్ బాబు కూడా కేటీఆర్ కోరిక మేరకు ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకోవడం తెలిసిందే. అయితే ఏ గ్రామాన్ని దత్తత తీసుకోవాలన్న దానిపై పరిశీలించిన పిమ్మట మహేశ్ బాబు సిద్దాపురం అనే గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ గ్రామం మహబూబ్ నగర్ జిల్లా.. కొత్తూరు మండలంలో ఉంది. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా తెలంగాణలో ఓ గ్రామాన్ని.. ఆంధ్ర రాష్ట్రంలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్న సంగతి విదితమే.






