విదర్భకు కూడా ఒకే
posted on Aug 2, 2013 10:02AM
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా ప్రకటన చేసి కాంగ్రెస్ పుట్టించిన ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపధ్యంలో మరిన్ని డిమాండ్లు తెరమీదకు వస్తున్నాయి. అంతేకాదు ఇన్నాళ్లు ఈ డిమాండ్లకు దూరంగా ఉన్న నాయకులు కూడా ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటుకు మద్దతు పలుకుతున్నారు.
ఇన్నాళ్లు తెలంగాణకు మద్దతు పలికినా… తన సొంతం రాష్ట్రంలోని విదర్భ ఏర్పాటు గురించి ఏనాడు నోరు విప్పని శరద్ పవార్ తొలిసారిగా విదర్భ ఏర్పాటు గురించి మాట్లాడారు.. అక్కడి ప్రజలు మనోభావాలను గౌరవించి విదర్భ ప్ర్యతేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని కోరారు.
ఈ అంశంపై ఎన్సిపి ఉపాధ్యక్షుడు, కేంద్రమంత్రి ప్రపుల్ పటేల్ ప్రకటన విడుదల చేశారు. అక్కడి ప్రజల మనోభావాలకనుగుణంగా విదర్భ ఏర్పాటుకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. రెండో ఎస్సార్సీ ద్వారా రాష్ట్రాల విభజనకు కూడా తమ మద్దతు ఉంటుందన్నారు.