Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రసవత్తరంగా మారిన నాగర్ కర్నూల్ పోరు
posted on: Mar 9, 2012 1:01PM
మహబూ
బ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోరు రసవత్తరంగా మారింది. ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొని వుంది. పోటీచేస్తున్న ముగ్గురిలో ఇద్దరికి అపార రాజకీయ అనుభవం వుంది. మరో అభ్యర్ధి ఇటీవలే రాజకీయ రంగప్రవేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పూచకుళ్ళ దామోదర్ రెడ్డి అభివృద్ధి నినాదంతో పల్లె పల్లెలో ప్రచారం చేస్తున్నారు. 30 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్న నేతలు నాగర్ కర్నూల్ కు ఒరగబెట్టిందేమీ లేడని, తనను ఎన్నుకుంటే నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తామని తెలుగుదేశంపార్టీ అభ్యర్ధి మర్రి జనార్ధనరెడ్డి అంటున్నారు. తెలంగాణా రాష్ట్రసమితి మద్దతుతో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేస్తున్న నాగం జనార్ధనరెడ్డి ప్రత్యేక తెలంగాణా నినాదంతో రంగంలో ఉన్నారు. అభ్యర్ధుల బలాలు, బలహీనతలు విషయానికి వస్తే....
స్వతంత్ర అభ్యర్ధి నాగం జనార్ధనరెడ్డికి ప్రతి గ్రామంలో అనుచర గణం ఉంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకముందే ధూం ధాంల పేరిట నియోజకవర్గం మొత్తం ఇప్పటికే ఆయన పర్యటించారు. ఆయనకు తెరాస, సిపిఐ, బిజెపిలు మద్దతు ప్రకటిస్తున్నాయి. అయితే ఆయన 20 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉంటూ మంత్రి పదవులు అధిష్టించినప్పటికీ నియోజకవర్గ అభివృద్ధికి పెద్దగా ఏమీ చేయలేదనే అపవాదు ఉంది. గతంలో నాగం వెంటవున్న కొంతమంది మండలస్తాయి, గ్రామస్తాయి నాయకులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోవడం ఆయనకు కొంత ఇబ్బందిగా మారింది.
తెలుగుదేశంపార్టీ అభ్యర్ధి మర్రి జనార్ధనరెడ్డి రాజకీయాల్లోకి కొత్తగా వచ్చారు. తనకు ఒక అవకశంఇస్తే నియోజకవర్గ రూపరేఖలు మార్చేస్తానని ప్రచారం చేస్తున్నారు. తన పేరిట ఉన్న ఛారిటబుల్ ట్రస్ట్ తో ఏడాదికి ఒక్కో మండలానికి మూడుకోట్ల రూపాయలు వెచ్చించి ఆ మండల అభివృద్ధికి కృషిచేస్తామని, ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుచేసి పేద విద్యార్ధులకు చదువుకునే అవకాశం కల్పిస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నారు. ఇన్నాళ్ళు స్తబ్దంగా ఉన్న తెలుగుదేశంపార్టీ కేడర్ లో మర్రి రాకతో ఒక్కసారిగా ఉత్సాహం కనిపించింది. అయితే గ్రామస్థాయిలో ఆయనకు నమ్మకమైన అనుచరగణం గాని, పార్టీకి పెద్దగా కేడర్ గాని లేకపోవడం ప్రధాన ప్రతికూల అంశాలు.
కాంగ్రెస్ పార్టీ తరపున రంగంలో ఉన్న దామోదర్ రెడ్డి వివాద రహితుడిగా, అన్ని వర్గాలను కలుపుకుని పోయే స్వభావం ఉన్నవాడిగా మంచి పేరుంది. మూడుసార్లు ఆయన నాగర్ కర్నూల్ బరిలో దిగి ఓడిపోయిన నేపధ్యంలో ఆయనపై ప్రజలు కొంత సానుభూతి చూపిస్తున్నారు. అయితే కాంగ్రెస్ లో ఇతర నాయకుల సహాయ సహకారాలు పెద్దగా లేకపోవడం ఈయనకుగల ప్రధాన ప్రతికూల అంశం.


.jpeg)
.jpeg)


