కృష్ణాలో మాగంటి వర్సెస్ ముద్రబోయిన

కృష్ణాజిల్లా నూజివీడు టీడీపీ ఇన్ ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వర్రావుకి, ఏలూరు టీడీపీ ఎంపీ మాగంటి బాబుకి మధ్య విభేదాలు రచ్చకెక్కాయి, ముద్రబోయిన, మాగంటి ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు, తనకు సమాచారం ఇవ్వకుండా మాగంటి బాబు... ఆయన బంధువులను, ఇతర నేతలను తీసుకుని తన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారని, తాను బీసీని అయినందువల్లే ఇలా చేస్తున్నారని ముద్రబోయిన ఆరోపిస్తున్నారు, అయితే ముద్రబోయిన ఆరోపణలను ఖండించిన మాగంటి... తాను నూజివీడు నియోజకవర్గంలో పర్యటించినప్పుడు ముద్రబోయినకు ఫోన్ చేశానని, కానీ ఆయన హైదరాబాద్ లో ఉన్నానని చెప్పారని అంటున్నారు, మాగంటి వ్యాఖ్యలను ముద్రబోయిన కూడా ఖండిస్తున్నారు, తనకు అసలు ఫోనే చేయలేదని... అయినా తనంటే గిట్టని నాయకులను వెంటబెట్టుకుని తన నియోజకవర్గంలో పర్యటించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు