Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పది కుక్కలు.. బాలికను చంపేశాయి
posted on: Apr 15, 2015 3:06PM

గుంటూరు జిల్లాలోని కాకుమాను గ్రామంలో ఘోరం జరిగింది. షేక్ కౌషర అనే ఆరేళ్ళ బాలిక మీద పది కుక్కలు ఒకేసారి దాడిచేసి చంపేశాయి. ఈ పాప తన ఇంటి ముందే ఆడుకుంటూ వుండగా ఈ దారుణం జరిగింది. ఈ గ్రామంలో ఇటీవలి కాలంలో పిచ్చికుక్కల బెడద పెరిగిపోయింది. జనం ఇళ్ళలోంచి బయటకి రావడానికి కూడా జంకుతున్నారు. కుక్కల దాడి కారణంగా బాలిక మరణించడంతో ఆ బాలిక తల్లిదండ్రులు, బంధువులు దిగ్భ్రాంతికి గురయ్యారు. బాలిక మృతదేహంతో గుంటూరు - కాకుమాను రహదారి మీద బైఠాయించి నిరసన తెలిపారు. ఉద్రిక్త వాతావరణం ఏర్పడటంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బాలికను కుక్కలు చంపిన ఘటన పట్ల ఆంధ్రప్రదేశ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆ గ్రామంలో, రాష్ట్రంలో పిచ్చికుక్కల నియంత్రణకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.






