తెలంగాణలో లారీల బంద్
posted on: Jun 22, 2015 10:44AM
ఈనెల 23 నుంచి తెలంగాణలో లారీల బంద్ చేయాలని లారీ ఓనర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. లారీల యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలంగాణ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 23 నుంచి నిరవధిక సమ్మె చేయబోతున్నామని లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రకటించారు. ఆదివారం రాత్రి జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సింగిల్ పర్మిట్ (కౌంటర్ సిగ్నేచర్ పర్మిషన్) ఇవ్వాలని, 15 సంవత్సరాలు దాటిన వాహనాలను కాలం చెల్లిన వాహనాలుగా నిర్ణయించే విధానాన్ని కూడా విరమించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే మరోవైపు తెలంగాణ స్టేట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ కూడా సమ్మె తలపెట్టింది. ఈనెల 24 నుంచి వీరు సమ్మె చేయబోతున్నారు.






