Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఏపీ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్.. రూ.1200 కోట్ల ఫీజురీయింబర్స్ మెంట్ నిధులు విడుదల
posted on: Feb 11, 2026 2:26PM
.webp)
ఆర్భాటం లేదు, హడావుడి లేదు.. ఫుల్ పేజీ ప్రకటనలు లేవు.. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించేశారు. అది ప్రభుత్వ బాధ్యత, చేసి తీరాలి అన్నట్లుగా చాలా కామ్ గా జగన్ హయాం నుంచీ బకాయిపడిన మొత్తం రీయింబర్స్ మెంట్ ను ప్రభుత్వం చెల్లించేసింది. విద్యాశాఖ మంత్రిగా ఈ ఘనత నిస్సందేహంగా నారా లోకేష్ ఖాతాలోనే పడుతుంది. విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు 12వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసిందంటూ నారా లోకేష్ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో షేర్ చేశారు.
గత జగన్ ప్రభుత్వ విద్యా దీవెన పథకంలో భాగంగా నిధులను తల్లుల ఖాతాల్లో జమ చేయడం వల్ల అనేక సమస్యలు తలెత్తాయి. ఆ నిధులను చాలా మంది ఇతర కుటుంబ అవసరాలకు వాడుకోవడంతో కాలేజీలకు ఫీజులు చెల్లింపులు జరగలేదు. ఫలితంగా విద్యాసంస్థల్లో వేల కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయి, విద్యార్థుల సర్టిఫికెట్లు నిలిచిపోయే పరిస్థితిఏర్పడింది. గత ప్రభుత్వం దాదాపు నాలుగువేల కోట్ల రూపాయల బకాయిల పెట్టింది. జగన్ సర్కార్ తప్పుడు విధానాల వల్ల విద్యార్థులు, విద్యాసంస్థల యాజమాన్యాలూ కూడా పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ సమస్యపైనే ప్రధానంగా దృష్టి సారించారు. విద్యార్థుల ఫీజురీయింబర్స్ మెంట్ నిధులను నేరుగా కాలేజీల ఖాతాల్లోకే జమ చేసేలా విధానాన్ని రూపొందించారు. ఇప్పుడు తాజాగా విడుదల చేసిన 1,200 కోట్ల రూపాయలతో పాత బకాయిలతో పాటు ప్రస్తుత విద్యా సంవత్సరం ఫీజులను కూడా క్లియర్ అయ్యేలా చేశారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యవ వేదికగా పేర్కొన్న నారా లోకేష్.. విద్య విషయంలో ఆందోళన వలదు.. విద్యార్థులు శ్రద్ధగా చదువుకోండి, ప్రభుత్వం మీకు అండగా ఉందని భరోసా ఇచ్చారు. రీయింబర్స్ మెంట్ పాత బకాయిలన్నీ తీర్చి, ఇక నుంచి సకాలంలో నిధులు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.


.webp)



