TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

లోకేష్ స్నేహితుడు అభీష్టపై ఆరోపణలు

Published on: Tue Oct 27, 2015 3:29PM

 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ను ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి టార్గెట్ చేశారు, ప్రభుత్వ వ్యవహారాల్లో లోకేష్ జోక్యం పెరిగిపోతుందని, సెకండ్ పవర్ సెంటర్ గా వ్యవహరిస్తున్నాడని రఘువీరా ఆరోపించారు. చంద్రబాబు ఆఫీస్ లోని ఫైళ్లన్నీ చినబాబు కనుసన్నల్లోనే కదులుతున్నాయన్న విమర్శించిన రఘువీరారెడ్డి... లోకేష్ సన్నిహితుడు అభీష్టను సీఎం పేషీలో ఓఎస్డీగా ఎలా నియమించారని ప్రశ్నించారు. ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకుండా నియమ నిబంధనలకు విరుద్ధంగా అభీష్టను నియమించారని, అసలు అభీష్టకున్న అర్హతలేంటో చెప్పాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు.