Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం
posted on: Feb 10, 2026 5:44PM

లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ పూర్తయ్యే వరకు పూర్తయ్యే వరకు సభకు రాకూడదని నిర్ణయం తీసుకున్నారు. సభాపతి ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ లోక్సభ సెక్రటరీ జనరల్కు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా నోటీసు ఇచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 94(c) ప్రకారం ఈ నోటీసు అందజేసినట్లు కాంగ్రెస్ వెల్లడించింది.
ఈ అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, డీఎంకే సహా పలు పార్టీలకు చెందిన 120 మంది ఎంపీలు సంతకాలు చేశారు. ప్రజాప్రయోజన అంశాలను లేవనెత్తకుండా విపక్ష ఎంపీలను పదేపదే అడ్డుకోవడం, మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడం తీవ్రంగా బాధించిందని కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ తెలిపారు. ఎనిమిది మంది విపక్ష ఎంపీలను ఏకపక్షంగా సస్పెండ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన విమర్శించారు. మాట్లాడే హక్కు ఎంపీల ప్రాథమిక హక్కు అని, దానిని కాలరాస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా విపక్ష నేత రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, ఎనిమిది మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేయడం, కాంగ్రెస్ మహిళా ఎంపీలపై వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబేపై చర్యలు తీసుకోకపోవడం వంటి కారణాలతో అవిశ్వాస తీర్మానం అవసరమైందని విపక్షాలు స్పష్టం చేశాయి.


.webp)
.webp)


