లోక్ సభ.. బీజేపీ, కాంగ్రెస్ మాటల యుద్ధం

posted on: Dec 10, 2015 12:25PM

లోక్ సభలో బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ కేసులో ఇరు నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. మళ్లీ నిన్నకరువుపై చర్చ సందర్భంగా జరిగిన రగడలో వీరేంద్ర సింగ్ ఫెయిర్ స్కిన్ ఉన్న వాళ్లనే.. ప్రధాని పదవిలో కూర్చునేందుకు కాంగ్రెస్ ఎంపీలు అంగీకరిస్తారని విమర్శించారు. దీంతో వీరేందర్ సింగ్ చేసిన వ్యాఖ్యాలపై ఈరోజు లోక్ సభలో కాంగ్రెస్ నేతలు ఆయనపై మండిపడ్టారు. స్పీకర్ పోడియం చుట్టు ముట్టి పేపర్లు చింపి డిప్యూటీ స్పీకర్ పై వేస్తూ.. మోడీని హిట్లర్ అంటూ.. నియంత అంటూ కామెంట్లు చేశారు. ఈ సందర్బంగా వెంకయ్య మాట్లాడుతూ మోడీని హిట్లర్ అని విమర్శించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...