ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరైన రజత్ భార్గవ

posted on: Jul 11, 2025 4:15PM

 

ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. విశ్రాంత ఐఏఎస్ అధికారి రజత్‌ భార్గవ సిట్‌ ఎదుట హాజరయ్యారు. తన అనారోగ్యం రీత్యా రాలేనని సిట్ విచారణకు హాజరుకాలేనని ఉదయం ఆయన విచారణాధికారులకు సమాచారం పంపించారు. కానీ, తప్పనిసరిగా హాజరుకావాలని సిట్‌ స్పష్టం చేయడంతో ఆలస్యంగా విచారణకు హాజరయ్యారు. వైసీపీ హయాంలో రజత్‌ భార్గవ ఎక్సైజ్‌శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు. దీంతో లిక్కర్ పాలసీ విడుదలైన జీవోలు, లావాదేవీలు తదతర విషయాలపై సిట్‌ అధికారులు ఆయన్ను విచారిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు నేతలు, అధికారుల్ని సిట్‌ విచారించి అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

google-ad-img
    Related Sigment News
    • Loading...