మన్మోహన్ కు రాసిన లేఖ మోడీకి చేరింది

ఓ యువకుడు 15 నెలల క్రితం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు రాసిన లేఖ ప్రస్తుత ప్రధాని అయిన మోడీకి అందింది. ఈ విచిత్రమైన ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఉత్తరప్రదేశ్ లో బులంద్ షహర్ ప్రాంతానికి చెందిన మంజిత్ అనే యువకుడు తన చెల్లెళ్ల పెళ్లిళ్లు చేయలేకపోతున్నానని, ఉద్యోగం ఇప్పించాలంటూ కోరుతూ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఓ లేఖ రాశాడు. కానీ అప్పట్లో ప్రభుత్వాలు మారడం, మోడీ ప్రధాని కావడం, ఆలేఖను మోడీ చూడటం జరిగాయి. దీంతో ఆ యువకుడికి రూ.50 వేలు ఆర్ధిక సహాయం అందించారు. కానీ తన ఇద్దరు చెల్లెళ్ల పెళ్లి చేయడానికి కనీసం 7 లక్షల రూపాయలు ఖర్చవుతుందని, మోడీ అందించిన 50 వేలు ఏ మూలకీ రావని యువకుడి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు