వామపక్ష తీవ్రవాద కట్టడికి కేంద్రం సాయం కావాలి!
posted on: Oct 8, 2024 1:27PM

ఆంధ్రప్రదేశ్ లో వామపక్ష తీవ్రవాద నిర్మూలనకు కేంద్రం సహకారం అవసరమని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సోమవారం హస్తినలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆమె వామపక్ష తీవ్రవాద నిర్మూలనకు రాష్ట్రానికి 800 మంది ప్రత్యేక పోలీసు అధికారులను కేటాయించాలని కోరారు. అలాగే ప్రత్యేక పోలీసు అధికారుల గౌరవ వేతనానికి సంబంధించి కేంద్రం ఇవ్వాల్సిన రూ.25.69 కోట్లను రీయింబర్స్ కోరారు.










