విషాదంలో వివేకా!

posted on: May 9, 2012 10:01AM

దివంగత మాజీముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి సోదరుడు వై.ఎస్. వివేకానందరెడ్డి ప్రస్తుతం తీవ్ర నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నారు. పులివెందుల ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు మంత్రి పదవిని వదులుకొన్న ఆయన ఆ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. అనంతరం రాజ్యసభ టిక్కెట్టు కోసం విశ్వప్రయత్నం చేసి విఫలమైన వివేకా జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు ఎవరికీ కాకుండా పోయారు. జిల్లాలోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్లకు జరగబోయే ఉప ఎన్నికల్లో పార్టీ ఆయనను కనీసం సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుంటోంది. దీంతో వివేకానందరెడ్డి తీవ్ర మనస్థాపానికి గురయ్యారు.

 

 

 

జిల్లాలో రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల అభ్యర్థుల విషయంలో ఎవరూ కనీసం ఆయన అభిప్రాయాన్ని అడుగలేదని వివేకా అనుచరులు వాపోతున్నారు. ప్రచారానికి కూడా ఆయనను పిలవటం లేదని వారు అంటున్నారు. ఈ పరిణామాన్ని గ్రహించిన వివేకా ప్రస్తుతం పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. వై.ఎస్. మరణానంతరం తన అన్న కుటుంబాన్ని సైతం దూరం చేసుకుని కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచానని అందకు ప్రతిఫలంగా కాంగ్రెస్ తనకేమి ఇచ్చిందని ఆయన ప్రశ్నిస్తున్నారు. వచ్చే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులేవరైనా తన అన్న రాజశేఖరరెడ్డిని విమర్శిస్తే తాను సహించబోనని ఆయన హెచ్చరిస్తుండడం విశేషం.

google-ad-img
    Related Sigment News
    • Loading...