విశాఖ జిల్లాలో పేలిన మందుపాతర

 

 

 

ఎన్నికల ముందు ఎన్నో చిత్రాలు జరుగుతున్నాయి. డబ్బు, మద్యం ప్రవహిస్తున్నాయి. ఎన్నికల సందర్భంగా అల్లర్ల సృష్టించడానికి సంఘ వ్యతిరేక శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయి. నిన్నటి వరకు శాంతిభద్రతలకు భంగం కలిగించడానికి సేకరించి పెట్టుకున్న బాంబుల లాంటి ఆయుధాలను పోలీసులు అనేక ప్రాంతాల్లో స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నం జిల్లాలో మందు పాతర పేలింది. విశాఖ జిల్లా పెద్ద బయలు మండలం చీకుపనస గ్రామంలో సోమవారం నాడు మందుపాతర పేలింది. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు. ఈ మందుపాతరకి, ఎన్నికలకు సంబంధం వుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.