అళగిరి మీద కబ్జా కేసు

posted on: Aug 30, 2014 1:55PM

 

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకె అధినేత కరుణానిధికి ఈ వయసులో ఆయన పెద్ద కుమారుడు అళగిరి పెద్ద తలనొప్పై కూర్చున్నాడు. పార్టీలో పెద్ద న్యూసెన్స్‌గా మారిన ఆయన ఈ మధ్య కరుణానిధి రెండో కుమారుడు స్టాలిన్ త్వరలో చనిపోతాడన్నట్టుగా కామెంట్లు చేశాడు. దాంతో కరుణానిధి మనసు కష్టపడి అళగిరిని పార్టీ నుంచి బహిష్కరించారు. తాజాగా అళగిరి మరో తలనొప్పిని తెచ్చిపెట్టాడు. మదురైలో అళగిరికి ఓ కాలేజీ వుంది. ఆ కాలేజీ పక్కన వున్న 44 సెంట్ల భూమిని ఆక్రమించేశాడు. దాంతో ఆ భూమి యజమానులు అళగిరి మీద ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అళగిరిని అరెస్టు కూడా చేసే అవకాశం వుందని తెలుస్తోంది. ఇదిలా వుంటే, అళగిరి మీద చేస్తున్న ఆరోపణలు రాజకీయంగా ప్రేరేపించినవేనని ఆయన సన్నిహితులు అంటున్నారు. అళగిరికి సెప్టెంబర్ 3వ తేదీ వరకు మద్రాస్ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...