హనుమంతప్పకు దేశ వ్యాప్త ప్రార్ధనలు.. ప్రముఖుల ట్వీట్లు.

posted on: Feb 10, 2016 11:37AM

గత వారం సియాచిన్‌లో ఏర్పడిన హిమపాతంలో 10మంది సైనికులు గల్లంతైన సంగతి తెలిసిందే. వారిలో తొమ్మిది మంది జవాన్లు చనిపోగా ఒక హనుమంతప్ప మాత్రం మృత్యుంజయుడై సజీవంగా బయటపడ్డాడు. హిమపాతంలో గల్లంతైన జవాన్ల కోసం రెస్క్యూ టీమ్ అక్కడి వెళ్లి వారిని వెలికితీసే క్రమంలో హనుమంతప్ప సజీవంగా బయటపడ్డాడు. దీంతో అతనిని ఢిల్లీ ఆర్మీ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే హనుమంతప్ప కోమాలోకి వెళ్లినట్టు వైద్యులు చెప్పిన నేపథ్యంలో అతను తొందరగా కోలుకోవాలని దేశవ్యాప్తంగా ప్రార్ధనలు జరుపుతున్నారు. అంతేకాదు అతను కోలుకోవాలని ప్రముఖులు కూడా ట్వీట్టర్లో ట్వీట్స్ కూడా చేస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...