Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...విజయవాడ సింహగర్జన
posted on: Aug 28, 2013 3:01PM
.jpg)
సమైక్యాంధ్ర కోరుతూ విజయవాడ విద్యార్థులు సింహాల్లా గర్జించారు. వారు వేలాదిగా తరలివచ్చి బందరు రోడ్డులో శాంతియుత నిరసన తెలిపారు. వారు జై సమైక్యాంధ్ర నినాదాలు చేస్తుంటే… విజయవాడ దద్దరిల్లుతోంది. దేవినేని అవినాష్ నాయకత్వంలో సమైక్యాంధ్ర విద్యార్థి గర్జన పేరిట జరిగిన ఈ కార్యక్రమంలో విజయవాడలోని అన్ని విద్యాసంస్థలు విద్యార్థులు పాల్గొన్నారు. ఆ జనాన్ని చూస్తుంటే… సముద్రాన్ని చూస్తున్నట్టే అనిపించింది. ఇసుకేస్తే రాలని జనం… జై సమైక్యాంధ్ర అని నినాదం చేస్తుంటే… నాయకుల గుండెలు దద్దరిల్లాయి.
అన్ని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు హాజరైన ఈ కార్యక్రమానికి పలువురు నాయకులు కూడా వచ్చారు. హైదరాబాదు ఏ ఒక్కరి సొత్తూ కాదని… అది అందరి సొత్తని విద్యార్థులు నినదించారు. లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ ఇది డబ్బు సంచుల్లోంచి వచ్చిన ఉద్యమం కాదని… తెలుగు తల్లి గర్భం నుంచి వచ్చిన ఉద్యమం అన్నారు. శాంతియుతంగా తరలివచ్చిన ఈ అఖండ విద్యార్థి సమూహాన్ని డబ్బుతో కొనడం సాధ్యం కాదని… తెలుసుకునే విజ్ఞానం తెలంగాణ నేతలకు లేదన్నారు.
మరోవైపు కర్నూలు జిల్లా నందికొట్కూరు విద్యార్థులు కూడా గర్జించారు. ఈ విద్యార్థి గర్జన సభకు దీక్ష చేస్తున్న కాటసాని రాంభూపాల్ రెడ్డికి సంఘీభావం ప్రకటించారు. సమైక్యాంధ్రను సోనియా ఇవ్వక్కర్లేదని.. ప్రజలే సాధించుకుంటారని అన్నారు.






