నెయ్యి కల్తీపై సిట్ విచారణ!

posted on: Sep 24, 2024 12:02PM

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)తో విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన జీవో ఈ సాయంత్రంలోగా విడుదలయ్యే అవకాశం ఉంది.  కాగా లడ్డూ ప్రసాదం కల్తీ విషయంలో డీజీపీ ద్వారకాతిరుమలరావు, ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా చంద్రబాబుతో నిన్న రాత్రి భేటీ అయ్యారు. ఈ రోజు ఉదయం కూడా వీరు మరో సారి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ భేటీల్లో సీట్ చీఫ్ గా ఎవరిని నియమించాలన్న విషయంపై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో సిట్ చీఫ్‌గా గుంటూరు రేంజి ఐజి సర్వసేష్ట త్రిపాఠిని నియమించారు. సిట్ డిఐజిగా విశాఖ రేంజ్ డిఐజి గోపీనాథ్ జెట్టి, సీట్ ఎస్పీగా కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు నియమితులయ్యారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...