Latest News
కృష్ణా బోర్డు ఛైర్మన్తో దేవినేని భేటీ
posted on: Oct 24, 2014 5:07PM

కృష్ణా రివర్ బోర్డు ఛైర్మన్తో ఆంధ్రప్రదేశ్ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన బోర్డు చైర్మన్ దృష్టికి శ్రీశైలం జల విద్యుత్ సమస్యను తీసుకుని వెళ్ళారు. శ్రీశైలంలో జల విద్యుత్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం మొండిగా వెళ్తోందని ఛైర్మన్కి మంత్రి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కృష్ణా రివర్ బోర్డు ఛైర్మన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు.
Latest YouTube Trending Video NEWS


.jpg)



