పుష్కర ఘాట్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు

త్వరలో జరగనున్న కృష్ణా పుష్కరాల కోసం విజయవాడలో ఏర్పాట్లు ముమ్మరంగా జరగుతున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణానది వెంట ఉన్న పుష్కర ఘాట్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. తక్షణం పుష్కరఘాట్లు నిర్మించాలని, గడువులోగానే ఘోట్ల నిర్మాణం పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి దేవినేని, ఎంపి కేశినేని, కలెక్టర్ బాబు తదితరులున్నారు.