రాజీనామా చేస్తానంటున్న టీడీపీ ఎమ్మెల్యే

 

కృష్ణా డెల్టాలో సాగునీటి ఎద్దడి అధికార పార్టీ ఎమ్మెల్యేలకు చిక్కులు తెచ్చిపెడుతోంది, గతంలో ఎన్నడూలేనివిధంగా సాగునీరు అందక పంటలు దెబ్బతిని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో కృష్ణా డెల్టాలో పరిధిలోని టీడీపీ ఎమ్మెల్యేపై ఒత్తిడి పెరుగుతోంది, నీళ్ల కోసం రైతులు నిలదీస్తుండటంతో ఏం చేయాలో పాలుపోక అధికార పార్టీ ఎమ్మెల్యేలు సతమతమవుతున్నారు, దాంతో సాగునీటి సమస్యపై కొందరు ఎమ్మెల్యేలు తీవ్రంగా స్పందిస్తున్నారు, ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత, పెడన టీడీపీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు... నీటిపారుదలశాఖ అధికారులపై మండిపడ్డారు, కృష్ణా డెల్టాలో సాగునీటి ఎద్దడిని తీర్చకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ హెచ్చరిస్తున్నారు, సాగునీటి సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడుతానని, అయినా పరిష్కారం కాకపోతే అప్పుడు రాజీనామాపై ఆలోచిస్తానని పెడన ఎమ్మెల్యే అంటున్నారు.