దాడి చేసింది మా వాళ్లే: వైసీపీ ఎమ్మెల్యే

 

ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు రణరంగాన్ని తలపించాయి. చాలా చోట్ల ఒకరిపై ఒకరు భౌతికంగా దాడి చేసుకున్నారు. ఇటీవల నెల్లూరు జిల్లా TNSF అధ్యక్షుడు తిరుమల నాయుడిపై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ కేసులో నిందితులు తనవాళ్లేనని. వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంగీకరించారు. గురువారం ఈ కేసు విషయమై మీడియాతో మాట్లాడిన కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఈ కేసులో నిందితులు తన అనుచరులేనని, దీనిలో రెండో ఆలోచనకు తావు లేదన్నారు. తానేమీ దాచి పెట్టడం లేదని.. ఈ కేసులో అరెస్టైన వారంతా ఎన్నికల్లో తనతోపాటు పనిచేసిన వారేనన్నారు. అయితే.. తిరుమలనాయుడిపై దాడి తన వాళ్లే చేశారన్న దానిపై ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయన్నారు. కానీ పోలీసులు చెబుతున్నారు కాబట్టి నమ్ముతున్నానన్నారు.