స్పీకర్ పై వైసీపీ ఎమ్మెల్యేల అవిశ్వాస తీర్మానం..

వైసీపీ ఎమ్మెల్యేలు ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ పై అవిశ్వాస తీర్మానం పెట్టనున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని.. మాట్లాడే అవకాశమే ఇవ్వడంలేదని.. సభలో మాకు అన్యాయం జరుగతుందని వైసీపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్పీకర్‌ కోడెలపై అవిశ్వాస తీర్మానం ఇస్తామని చెప్పారు.