వెలుగులోకి కోడెల ఫ్యామిలీ బిగ్ స్కాం.. దూదిని కూడా వదల్లేదు!

posted on: Jul 7, 2019 12:44PM

 

టీడీపీ ఘోర పరాజయం తరువాత ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ కి చిక్కులొచ్చి పడ్డాయి. కోడెల కుటుంబం 'కే టాక్స్' పేరుతో ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేసిందని ఇప్పటికే పలువురు ఫిర్యాదు  చేసారు. అయితే కోడెల కుటుంబం వసూళ్లు మాత్రమే కాదు స్కాములు కూడా చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వాసుపత్రులకు దూదిని, ఇతర మెడికల్ సామాగ్రిని సరఫరా చేసే వ్యవహారంలో కోడెల కుటుంబం ఒక భారీ స్కామ్ చేసిందని వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వాసుపత్రులకు నాసిరకం దూది, ఇతర మెడికల్ సామాగ్రిని కోడెల కుటుంబం సరఫరా చేసినట్టుగా తెలుస్తోంది.

ఈ స్కామ్ లో పెద్ద వ్యూహమే ఉందట. ప్రభుత్వం నుంచి మెడికల్ సామాగ్రి సరఫరా కాంట్రాక్టును కోడెల కుటుంబం పొందింది. తమకు ఒక కంపెనీ ఉందని, దాన్నుంచి సరఫరా చేస్తామంటూ.. ప్రభుత్వానికి భారీ ధరకు సరకును సరఫరా చేసే కాంట్రాక్టు పొందిందట. అయితే వారికసలు దానికి సంబంధించిన కంపెనీ ఏదీ లేదని తెలుస్తోంది. తమిళనాడు నుంచి నాసిరకం సామాగ్రిని దించి.. వాటికి వీరి కంపెనీ పేరుతో ఒక లేబుల్ అతికించి వాటినే ప్రభుత్వ ఆసుపత్రులకు పంపినట్టుగా తెలుస్తోంది. నాసిరకం ఉత్పత్తులకు ఒక నకిలీ కంపెనీ స్టిక్కర్లను అతికించి ప్రభుత్వం నుంచి కోట్ల రూపాయలను దోచేసిందట కోడెల కుటుంబం. అసలే ఫిర్యాదులు, ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కోడెల కుటుంబం.. మరి ఈ వ్యవహారంతో ఇంకెలాంటి ఇబ్బందులు ఎదుర్కుంటుందో చూడాలి.

google-ad-img
    Related Sigment News
    • Loading...