TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పవన్ చెబితే ఒప్పు.. జగన్ చెబితే రాజకీయమా?

Published on: Wed Aug 26, 2015 4:17PM



ఏపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం రైతుల దగ్గర నుండి భూములు సేకరిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయవాడలో సీఆర్ డీఏ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని రైతులకు మద్దతునిస్తూ.. ఆపార్టీ నేతలు వారితో పాటు భూసేకరణ కింద ఇప్పటికే భూములు కోల్పోయిన.. భూ సేకరణ పేరుతో భూములు కోల్పోనున్న రైతులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ భూసేకరణ విషయంలో రైతులు భయపడొద్దని.. మీకు అండగా మేము ఉన్నామని అన్నారు. అంతేకాక భూసేకరణపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రైతుల దగ్గరనుండి భూములు లాక్కోవద్దని చెప్పారు.. ఇప్పుడు జగన్ కూడా అదే చెపుతున్నారు అయితే పవన్ కళ్యాణ్ చెపితే నిజమని అంటున్న నాయకులు జగన్ చెబితే రాజకీయ మంటున్నారని విమర్సించారు. ఇద్దురు చెప్పింది ఒకటే అయినప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పింది ఒప్పు ఇప్పుడు జగన్ చెప్పింది తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు.