Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కుటుంబాన్నే చంపేశాడు
posted on: May 15, 2015 10:46AM

శుక్రవారం నాడు వరల్డ్ ఫ్యామిలీ డే. కుటుంబ ప్రాధాన్యాన్ని తెలిపే రోజు. కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పే రోజు. కుటుంబానికి సంబంధించి ఇంత ప్రాధాన్యం వున్న ఈ రోజున హైదరాబాద్లో ఓ కిరాతకుడు తన కుటుంబాన్నే చంపేశాడు. హైదరాబాద్లోని బాలాపూర్ ప్రాంతంలో వున్న సాయినగర్తో ఈ ఘోరం జరిగింది. ఆస్తి తగాదాల నేపథ్యంలో సమ్మిరెడ్డి రామిరెడ్డి అనే వ్యక్తి తన తల్లి సుభద్ర (65), భార్య రాధిక (40), కుమార్తె అక్షయ (14)లను కత్తితో గొంతు కోసి చంపేశాడు. శుక్రవారం తెల్లవారుజామున నాలుగున్నర ప్రాంతంలో ఈ ముగ్గర్నీ చంపేసిన ఆ వ్యక్తి ఆ తర్వాత ఘటనా స్థలం నుంచి పరైరయ్యాడు. తర్వాత ఓ బావిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యలు జరిగిన సమయంలో హంతకుడి పెద్దకూతురు ప్రత్యూష ఇంట్లో లేకపోవడంతో బతికి బయటపడింది.






